Thursday, February 10, 2011

వీరికి పరస్త్రీలపై వ్యామోహం ఎక్కువ..!







27 నక్షత్రముల్లో మొదటిదైన అశ్విని నక్షత్రములో పుట్టిన జాతకులు పరస్త్రీలపై వ్యామోహం కలిగి ఉంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు.

దాదాపు 45 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళ యోగానికి ఎటువంటి భంగం వాటిల్లదు. బంధువులలో, స్త్రీలతో కలిగి ఉండే విబేధాలు వీరిని అత్యున్నత స్థితికి చేరుకోకుండా అడ్డుకుంటాయి.

ఈ నక్షత్రములో ఏ పాదములోనైనా జన్మించిన జాతకులు వృత్తి ఉద్యోగాల్లో ప్రథమ స్థానాన్ని కోరుకుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనికోసం వారు విశేషంగా కృషిచేస్తారు. స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగే వీరు, స్థిరాస్తులను సంపాదిస్తారు. వైద్య, క్రీడ, రాజకీయ రంగంలో ఆసక్తి కలిగి ఉంటారు.

జీవితంలో 24 సంవత్సరాలు వచ్చే వరకు కష్టసుఖాలతో సంబంధం లేకుండా గడిపేస్తారు. వీరికి సోదరుల నుంచి చికాకులు ఎదురవుతాయి. అంతరంగిక వర్గం సలహాలు స్వీకరించకపోతే ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు గొప్పవాళ్ళవుతారని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.

అశ్విని కేతు గ్రహ నక్షత్రం కావడంతో, నవగ్రహపూజ, నాగప్రతిష్ట చేయడం మంచిది. అదేవిధంగా గణపతి, గోపూజ చేయడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. పూజలు తొందరగా ఫలిస్తాయి.