Tuesday, October 9, 2012

శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు..?







శ్రీమహాలక్ష్మి, ఆమె అక్క జ్యేష్ఠాదేవికీ ఎవరెక్కడ ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవడంతో ఆమెను బైటకు రమ్మని జ్యేష్ఠాదేవి కోరింది.

ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తానెక్కడుంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకీ, కొత్త వ్యాపార లెక్కల పుస్తకాలకు పసుపు రాసి శ్రీమహాలక్ష్మీకి ఆహ్వానం పలుకుతారు.

ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల ఆమె కృప అన్ని వేళలా వారిపై ఉంటుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్ఠాదేవి ఆ పరిసరాల్లోకి రాదు.