Wednesday, October 10, 2012

స్త్రీల కాలివ్రేళ్లకు మట్టెలు పెట్టడంలో ఆంతర్యమేమిటి?









వివాహమైన స్త్రీని ముత్తైదువంటారు. అంటే ఆమె విధిగా ఐదు ముత్యములు లేక ఐదు ఆభరణాలు ధరించాలి. చెవులకు, ముక్కులకు, మెడలో మంగళసూత్రము, నల్లపూసలు, చేతులకు గాజులు, కాళ్లకు కడియాలు, కాలివేళ్లకు మట్టెలు ధరించాలి.

ఇందులో స్త్రీలు కాలి వ్రేళ్లకు మట్టెలు పెట్టడంలో ఆంతర్యమేమిటంటే..? కాళ్ల బొటన వ్రేలి పక్కనున్న వ్రేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దానినుంచి విద్యుత్తు ప్రసరిస్తుంటుంది. ఆ వేలు నేలకు తగిలితే అది నష్టమవుతుంది. అలా ఆ వేలు నేలకు తగలకుండా ఉండేందుకు మట్టెలు ధరిస్తారని పురోహితులు చెబుతున్నారు.

దక్షాపతి కుమార్తె దాక్షాయణి తన భర్త శివుడిని, తన తండ్రి దక్షప్రజాపతి అవమానించాడని తన కాలి వ్రేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమైనట్లు పురాణాలు చెబుతున్నాయి.