Saturday, March 16, 2013

తేనెను నీటిలో కలుపుకుని తాగితే బొజ్జ తగ్గిపోతుందట!







కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారిని ఆధునిక కాలంలో ఊబకాయం వేధిస్తోంది. ఊబకాయంతో బొజ్జ పెరిగిపోతుందే అని బాధపడుతున్నారా.. అయితే తేనెను నీటిలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడున తాగితే... రెండే నెలల్లో మీ బొజ్జ తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తేనెను టీ, కాఫీల్లో తీసుకుంటే అలసట తొలగిపోతుంది. తేనెలోని గ్లూకోజ్ రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తద్వారా గుండెపోటు వ్యాధులు దరిచేరవు. కంటి జబ్బులు, చర్మ సంబంధిత వ్యాధులు కూడా తేనె వాడకంతో నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే అల్లం రసంతో తేనెను కలిపి కాస్త వేడిచేసి ఆరబెట్టాలి. ఈ రసాన్ని తినేందుకు ముందు ఒక స్పూన్, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్‌ వేడినీటితో కలుపుకుని తాగితే 40 రోజుల్లో పొట్ట తగ్గిపోతుంది.

ఇక అనాస పండులో కూడా పొట్టను తగ్గించే గుణం ఉంది. అనాసపండు ముక్కల్ని, వోం పొడితో నీళ్లలో రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం ఆ రసాన్ని పరగడుపన తాగితే మీ పొట్ట తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.