Monday, February 24, 2014

కాకికి అన్నం ఎందుకు పెట్టడం?








కాకి శనైశ్చరుని వాహనం. మనము భోజనం చేసేముందు అన్నము దేవునికి నివేదనం చేసి కాకికి పెట్టమని మన పెద్దలు శాస్త్రము చెపుతున్నది. కాకి శనైశ్చరుని వాహనము మరియు మన పితరులు కూడా
కాకి స్వరూపములో మనచుట్టూ తిరుగుతూ వుంటారు. కాకి యమలోక ద్వారమందు వుంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ వుంటుంది.

కాకికి అన్నము పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు ఆశ్వాసము చెంది మనకు అసీర్వాదములు ఇస్తారు. కాకి అపర కార్యాడులందు మరియు శ్రాద్ధ దినమందు అన్నము ముట్టకపోతే మన పితరులకు మనపై ఆగ్రహం లేక కోపం వుందనేది పెద్దల మాట. అందువల్లే కాకి అన్నము ముట్టే వరకు తాపత్రయపడి ముట్టిన తర్వాత భోజనం చేస్తారు.

గయలో మనం పిండాలను వేసే శిలకు పేరు కాక శిల అని పేరు ఆ శిలపై పిండాములు వుంచి మన పితరులను ప్రార్తిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావు కావు మని కేకలు వేసి తన వారినందరినీ చేర్చుకొని అన్నము తింటుంది. అంత గొప్ప వివేకము గల ప్రాణి కాకి. గరుడ పురాణం మరియు తదితర పురాణములు మన పితరులు కాక రూపములో భూలోక సంచారం చేస్తూ మనము సమర్పించే అన్నము తింటూ మనలను ఆశీర్వదిస్తారు..

కాకికి అన్నము పెట్టేదాని వలన కుటుంబమున అన్యోన్యత సఖ్యత కలిగి వుంటారు. శని దేవత వాహనం కాకి అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగును. కాకి ఎవ్వరికీ హాని చేయని ప్రాణి మన చుట్టూ వుండే అశుద్దములను తొలగించటంలో మనకు సహాయ పడుతుంది కాబట్టి కాకికి అన్నం పెట్టడం అనే ఆచారం కూడా మన పెద్దలు ఏర్పాటు చేసారు .