Sunday, May 6, 2012

రవ్వ దోసె....!?







కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి: 1cup
మైదా: 1cup
సూజి(రవ్వ): 1cup
శెనగపిండి: 1/4(అవసరమనుకొంటేనే)
పచ్చిమిర్చి: 4-6
కరివేపాకు: రెండు రెమ్మలు
క్యారెట్ తురుము: 1tbsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: సరిపడా 

తయారు చేయు విధానం:

1. ముందుగా పచ్చిమిర్చిని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి.

2. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా, సూజి(సన్న రవ్వ), శెనగపిండి, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కరివేపాకు తురుము, జీలకర్ర పొడి, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి(అప్రాక్సిమేట్ గా ఒక ఆరు కప్పులు)దోసె పిండిలా జారుడుగా కలుపుకోవాలి. 

3. ఇప్పుడు పది పదిహేను నిమిషాల తర్వాత స్టౌ వెలిగించి, దోసె పాన్ పెట్టి వేడయ్యాక దోసె పోసుకొని పాన్ పూర్తిగా దోసెను రౌండ్ గా దిద్దుకొని పైన కొద్దిగా నూనె చల్లుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట మీద కాల్చుకోవాలి.

4. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని మీకు ఇష్టమైన చట్నీ మరియు సాంబార్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.