Wednesday, October 31, 2012

వైట్ పెట్రోలియం జెల్లీతో పాదాల పగుళ్ళకు చెక్.....!?








స్త్రీపురుషులు అనే తేడా లేకుండా వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా.. తడిలో ఉండే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పగుళ్ళ కారణంగా పాదాల నొప్పులు కూడా పుడుతుంటాయి.


ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే.. పాదాల పగుళ్ళ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రధానంగా.. తడి నుంచి నాణ్యమైన సాక్స్‌, షూ వేసుకోవడం వల్ల పాదాల పగుళ్ల నుండి కాపాడుకోవచ్చు.


పగుళ్లు వచ్చిన వారు పాదాలను రాత్రి పడుకునేముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు చిటికెడు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకుని వైట్‌ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పాదాల పగుళ్లు పోవడమే కాకుండా మృదువుగా కూడా తయారవుతాయని వైద్యులు చెపుతున్నారు.