Friday, November 30, 2012

దేవునికి మామిడిపండును నైవేద్యంగా సమర్పిస్తే....!?







దేవునికి మామిడిపండును నైవేద్యంగా సమర్పిస్తే.. ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి సమస్యలు లేకుండా వస్తుంది. గృహ నిర్మాణానికి రావలసిన అప్పు సకాలంలో విడుదల అవుతుంది.

మీకు ఎవరి నుంచైనా రావలసిన నగదు సకాలంలో రాకపోయినా, మీరు ఎవరికైనా నగదు చెల్లించాల్సిన సమయంలో చేతిలో డబ్బు లేకపోతే శ్రీ మహాగణపతికి మామిడిపండు నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని అందరికీ పంచితే మీకు రావలసిన నగదు సకాలంలో మీ చేతికందుతుంది.

చీటీల వ్యవహారంలో నష్టాన్ని అనుభవిస్తే అటువంటి వారు శ్రీ గణపతి హోమాన్ని చేసి పూర్ణాహుతికి మామిడి పండును నైవేద్యంగా ఇస్తే మీకు రావలసిన నగదు త్వరగా వస్తుంది. నమ్మించి మోసం జరిగినపుడు చేస్తే మామిడి పండుతో పాటు దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి మీరు కూడా తినాలి. దీంతో మీకు మోసం చేసిన జనం క్షమాపణలు చెప్పి మీ నగదును మర్యాదగా తీసుకుని వచ్చి ఇస్తారు.

రుతుమతి అవ్వని ఆడపిల్లలకు మామిడి పండు, అంజూర పండును దేవునికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా పంచితే అటువంటి వారు దేవుని అనుగ్రహంతో రుతుమతి అవుతారు. ఎటువంటి సమస్యలు తలెత్తవని జ్యోతిష్యులు తెలిపారు.