Saturday, December 1, 2012

అశాంతి పోవాలంటే కారం అటుకులు దానం చేయండి....!?






మీ ఇంట్లో అశాంతి నెలకొనివుందా.? భార్యాభర్తలు లేదా తల్లిదండ్రి ఎపుడు చూసినా గొడవలు పడుతున్నారా ఇత్యాది అంశాలకు సంబంధించి అనేక సమస్యలకు కాస్త ఉపశమనం కలగాలంటే కొన్ని దేవ ప్రసాదాలు దానం చేస్తే పోతుందని జ్యోతిష్యులు చెపుతున్నారు. ఇలాంటి ప్రసాదాల్లో కారం అటుకులు ఒకటి.

ఇంట్లో భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు, లేదా పిల్లలు గొడవపడుతుంటే వీటిని దానం చేయడం మంచిదట. అలాగే, ఇంట్లో అశాంతి నెలకొనివున్నా, వయస్సుకు మించిన కోపం, చిరాకు వస్తున్నా, ఎక్కువ రక్తపు పోటుతో బాధపడుతున్నా, మాట్లాడుతున్నప్పుడు వణుకున్నా ఈ ప్రసాదాన్ని దానం చేయాలని సూచిస్తున్నారు.

అంతేకాకుండా, ఎవరైతే మాట్లాడే సమయంలో నత్తినత్తిగా మాట్లాడుతున్నా, ఇంట్లో భయపడుతూ, బయట ధైర్యంగా ఉన్నా, పడుకున్న సమయంలో ఎక్కువగా మాట్లాడుతున్నా వీటిని దానం చేయమంటున్నారు.

పైన పేర్కొన్న లక్షణాలు ఉన్నవారు కారం అటుకులను తాంబూలంలో ఉంచి దానం చేస్తే మనసుకు చాలా శాంతి లభిస్తుందని, అన్ని పనులు చాలా త్వరగా నెరవేరుతాయని చెపుతున్నారు. అలాగే, అటుకులను ఊరగాయరసంలో కలిపి మీరు పూజను చేసిన తర్వాత దానం చేస్తే మీకు ఉన్న రక్తపోటు, కోపం త్వరగా తగ్గిపోతాయని సూచిస్తున్నారు.

అలాగే, అటుకులను దంచి కారం ఉన్న మిరపకాయ రసంలో కలిపి క్షుద్రదేవతలకు నైవేద్యం చేసి దానం చేస్తే మీలో ఉన్న రజోగుణం తమోగుణాలు త్వరగా వదిలి వెళతాయని వారు చెపుతున్నారు.