Friday, July 6, 2012

రవ్వతో చేసిన గంజిని దేవుడికి నైవేద్యంగా పెడితే...!!!?







రవ్వతో చేసిన గంజిని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా లావుగా ఉండే వారు సన్నగా అవుతారట. రజస్వల సమస్యలు, వివాహం వాయిదా పడుతూ పోతుంటే ఆ జాతకులు దేవి ఆలయానికి వెళ్లి మంగళవారం రవ్వతో చేసిన గంజిని దేవతకు నైవేద్యం చేసి పంచాలి. కానీ దాన్ని వారు తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అలాగే ఎవరికి సంతానం ఉండదో, ఎవరికి గర్భం నిలవదో, ఎవరికి గర్భస్రావం అవుతుంటుందో, ఎవరికైతే పిల్లలు పుట్టిన తర్వాత చేతిలో నిలవరో అటువంటి వారు గురువారం లేదా శుక్రవారం రోజు గోధుమ రవ్వ పాయసాన్ని దేవునికి 16వారాల పాటు పూజ చేసి ప్రసాదాన్ని పంచి, తాము కూడా తింటే పైన పేర్కొన్న దోషాలు తొలగి మంచి సంతానం కలుగుతుంది.